నడుం బిగించిన పోలీసులు నెరవేరిన ఆదివాసీల చిరకాల స్వప్నం!
ఆదివాసి గుడాలకు తోవ చూపిన ఆసిఫాబాద్ పొలీసులు
అనగనగా ఒక మారుమూల గిరిజన గ్రామం అంటూ మనం ఎన్నో కథలు చదువుతూవుంటాం వారి కష్టాలను వింటువుంటాం…… ఇలాంటి కథలకు సరిగ్గా సరిపోయే ఉదాహరణగా ఈ గూడ లను చెప్పుకోవచ్చు.గూడ లలో గుడిసెలు, మనుషులు అడవి తప్ప వెళ్లేందుకు దారి కూడా సరిగా ఉండదు. వైద్యం కోసం వెళ్ళాలన్న,సరుకుల కోసం వెళ్ళాలన్న గుట్టలను దాటుతూ కాలి నడకన వెళ్ళాల్సిన పరిస్థితి వున్నా మారుమూల గుడాలు అవి.
మావోయిస్టు ప్రబావిత ప్రాంతం ఆ రెండు గుడాలకు ఎటువంటి అత్యవసరమైన కాలి తోవనే శరణ్యము .ఒక్కమాటలో చెప్పాలంటే ఆ గుడాలకు పోవాలంటే ట్రెక్కింగ్ (గుట్టలపైకి )రేషన్ కైనా, వైద్యానికైనా గుట్ట తోవే వారికి మార్గము …ఇటువంటి పరిస్థితి లలో ఉన్న అక్కడి ఆదివాసుల కష్టాలను గుర్తించిన కోమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పొలీసులు పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ లో పోలీస్ మీ కోసం కార్యక్రమం లో భాగంగా వారి గుడాలకు రోడ్డు వేయించడము వారి ద్వారా కష్టాలకు కాలం చెల్లింది. వారి చిరకాల స్వప్నం నెరవేరింది.వారి ఒక తోవ చూపారు పోలీసులు……
వివరాలలోకి వెళితే…..
కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని అత్యంత మారుముల ,మావోయిస్టు ప్రభావిత గ్రామము చోర్ పల్లి ఆ గ్రామ పంచాయతీ పరిదిలోని లెండిగూడ ,పునగూడ గ్రామాలకు ఎటువంటి రహదారి లేకపొవడముతో ఆయ గూడల ఆదివాసులు గుట్ట తోవలో కాలిబాటలో రావాల్సిందే.కనీసం ఈ గ్రామము నుంచి నిండుగర్భిణి నుంచి పండు ముసలి అయిన పసిపాప అయిన వైద్య సహాయమునకు కాలి నడకన వెళ్లలిసిందే,చివరకు జ్వరలతో మంచం ఎక్కిన ,అనారోగ్యము పాలైనవారిని దవాఖానకు అదే మంచం పైన నలుగురు మోస్తూ లేదా జోలెలో కాలినడకన మోసుకు రావాలసిందే .. లెండిగూడ 1౦౦గుడిసేలతో 600 జనాభా ఉండగా,పునాగూడ లో 8 గుడిశెలతో ౩౦ మంథి జనాభా కలదు వీరందరు రేషన్ కోసమైన ,కిరాణం సామాను కోసమైన ,వైద్యం కోసం ఐనా చోర్ పల్లి కి రావాల్సిందే . చోరుపల్లి నుండి లెండిగూడ కు 4km దూరముండగా,బీమన్ గొంది నుండి ్పున గుడా కి 6 km దూరం కలదు. ఈ వేసవి లో కోమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో “పోలిస్ మీకోసం” కార్యక్రమములొ భాగంగా ఈ గుడాలను సందర్శించిన జిల్లా అదనపు ఎస్ పి వై.వీ సుదీంద్ర ,ఆసిఫాబాద్ డి ఎస్ పి ఎస్ ఆచేశ్వర్ రావు లు ఆదివాసీ లు వారి గూడ లకు రవాణా మార్గం అనేది లేక కనీసం కాలి తోవ కుడా సరిగా లేక వారు పడుతున్న ఇబ్బంది లను గమనించి వెంటనె అట్ఠి విషయాన్ని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇంచార్జి ఎస్.పి రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి.సత్యనాయరణ ఐపీఎస్ దృష్టికి తీసుకువెళ్లడముతో సిపి గారు స్పందించి వెంటనే తప్పక ఆ గుడాలకు రోడ్డు వేయించాలని తెలపడముతో ఎస్.పి సుదీంద్ర ,అదనపు ఎస్ పి అచ్చేశ్వర రావు ల పర్యవేక్షణలో జైనూర్ సి ఐ హనోక్ ,లింగపుర్ ఎస్ ఐ మధుకర్ లు ప్రజల సహకారంతో ,స్థానికుల ట్రాక్టర్ లు ఏర్పాటు చేసుకుని 20 రొజులు శ్రమించి రోడ్డు నిర్మాణ పనులను శేరవేగముగా పూర్తి చేసి ఆదివాసీ లా యొక్క చిరకాల స్వప్నం ను నెరవేర్చారు. రెండు గుడాలకు దారి చూపారు.దాదాపు రెండువేలకు పైగా ట్రిప్పులు మొరం వెయించి దానిపైన వర్షకాలంలో మరల బురదకాకుండా కంకర పొడి వేపించడముతో ప్రస్తుతము ఆ గుడాలకు ఆటో లు సైతము వెళుతున్నాయి.
తమ గూడ లకు సైకిల్ నడవడమే గగనమైన పరిస్థితులలో ఆసిఫాబాద్ పోలిసుల చొరవతో ద్విచక్ర,వాహనాల,ఆటో లు ,తిరిగుతున్నాయని ఇదంతా పోలీసుల చొరవేనని ఆదివాసీ గూడ ల ప్రజలు ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నా లెండిగూడ,పునాగూడ ఆదివాసులు.
యువతకు వాలీబాల్ కిట్స్, బియ్యం, ప్రభుత్వం ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు పోటీ పడే వారికీ స్టడీ మెటీరియల్ సీపీ గారి చేతులమీదుగా అందచేశారు.
ఒకవైపు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా లాక్ డౌన్ విధులు నిర్వహిస్తునే మరోవైపు కమ్యూనిటి పొలీసింగ్ లో బాగంగా ప్రజలతొ మమేకమై ఎన్నోయేండ్లుగా నెరవేరని వారి రహదారి కల సాకారం కావడముతో పోలీసులని అభినందిస్తున్నారు.